News August 26, 2025
రేపే వినాయక చవితి.. మార్కెట్లు రష్

వినాయక చవితికి మరొక్క రోజే మిగిలి ఉండటంతో మార్కెట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. వినాయక ప్రతిమలు కొనేందుకు ప్రజలతో పాటు మండపాల నిర్వాహకులు విక్రయ షెడ్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వ్యాపారులతో బేరమాడి ఐడల్స్ కొంటున్నారు. అటు పూజకు అవసరమైన పత్రీలు, వస్తువులు, పూలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సామగ్రి కొనుగోలుదారులతో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
Similar News
News August 26, 2025
ఈ నెల 29న క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 29న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News August 26, 2025
మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

TG: మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. 50 మంది స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 1.15 కేజీల గంజాయి, 47gms ఓజీ వీడ్ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.
News August 26, 2025
OP సిందూర్ ముగియలేదు: రాజ్నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, విరామం ఇచ్చామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్లో ఉదయగిరి, హిమగిరి వార్ షిప్లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. ‘2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.