News August 26, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

image

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News August 26, 2025

OP సిందూర్ ముగియలేదు: రాజ్‌నాథ్ సింగ్

image

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, విరామం ఇచ్చామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్‌లో ఉదయగిరి, హిమగిరి వార్ షిప్‌లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. ‘2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 26, 2025

సెంచరీలు కొట్టే సత్తా మాది!

image

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో యంగ్ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో రాణించారు. హరియాణాతో మ్యాచులో సర్ఫరాజ్ (ముంబై) సెంచరీ చేయగా, హిమాచల్‌ప్రదేశ్‌తో మ్యాచులో రుతురాజ్ (మహారాష్ట్ర) శతకం బాదారు. గైక్వాడ్ ఒకే ఓవర్లో 4 సిక్సులు బాదడం విశేషం. కాగా ఈ టోర్నీలో సర్ఫరాజ్‌కు ఇది రెండో సెంచరీ. కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు దక్కని వీరిద్దరికీ రాబోయే రోజుల్లోనైనా అవకాశం లభిస్తుందేమో చూడాలి.

News August 26, 2025

ట్రంప్ కాల్స్‌ను మోదీ పట్టించుకోలేదు: జర్మనీ మీడియా

image

సుంకాల విషయంలో ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ తలొగ్గలేదని జర్మనీ మీడియా సంస్థ FAZ తెలిపింది. ‘గత కొన్ని వారాల్లో సుంకాల విషయంలో ట్రంప్ చాలా సార్లు మోదీకి ఫోన్ కాల్ చేశారు. కానీ వాటిని ఆయన పట్టించుకోలేదు. కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. టారిఫ్స్ పేరు చెప్పి ట్రంప్ మిగతా దేశాలను ఓడించారు కానీ ఇండియాను ఏమీ చేయలేకపోయారు’ అని పేర్కొంది. ఈ వార్తను భారత ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.