News August 26, 2025

HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.

Similar News

News August 26, 2025

ASF: పూలాజీ బాబా జయంతి ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. మంగళవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఖష్బూగుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన జైనూర్ మండలం పట్నాపూర్‌లోని పూలాజీ బాబా సంస్థాన్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

News August 26, 2025

ఈనెల 28నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు: SP

image

కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారికి ఈనెల 28 నుంచి కైలాసగిరి ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వైద్య పరీక్షలు జరుగుతాయని SP తుహీన్ సిన్హా తెలిపారు. హాల్ టికెట్ నంబర్ 4001020 నుంచి 4152205 వరకు గల అభ్యర్థులు 28న, 4152904-4275272 వరకు గల అభ్యర్థులు 29న హాజరు కావాలన్నారు. అలాగే 4276418-4507457 వరకు గల అభ్యర్థులు ఈనెల 30న రావాలన్నారు. ఆయా రోజుల్లో హాజరు కాలేని వారు సెప్టెంబర్ 1న హాజరు కావాలన్నారు. >Share it

News August 26, 2025

వికారాబాద్ జిల్లా న్యాయవాదుల నిరసన

image

వికారాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. నిన్న కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్‌పై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటనకు నిరసనగా, ఈరోజు వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.