News August 26, 2025

దేశంలో అత్యంత విద్యావంతుడు ఇతడే!

image

ఇండియాలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరనే ప్రశ్నకు చాలా మందికి జవాబు తెలియకపోవచ్చు. ఆయనే మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. తన జీవితంలో 42 విశ్వవిద్యాలయ పరీక్షలు రాసి, ఏకంగా 20కి పైగా డిగ్రీలు పొందారు. MBBS & MD, LLB, LLM, MBA, జర్నలిజంలో పీజీ చేశారు. IPS & IAS కూడా అయ్యారు. అతి పిన్న వయస్కుడైన (26ఏళ్లలో) ఎమ్మెల్యేగానూ రికార్డులకెక్కారు. 2004లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.

Similar News

News August 26, 2025

కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్

image

టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కాబోయే భార్య వన్శికతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుల్దీప్ బ్లాక్ సూట్‌లో, వన్శిక వైట్ గౌన్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరికి జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. లక్నోకు చెందిన వన్శిక LICలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది.

News August 26, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

image

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణేశ్ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.

News August 26, 2025

టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్‌కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్‌జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.