News April 2, 2024

ఇంటికి పేరును మారిస్తే సొంతమైపోతుందా?: జైశంకర్

image

అరుణాచల్ ప్రదేశ్‌లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే, ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కాపలా ఉంది’ అని గుర్తుచేశారు.

Similar News

News March 12, 2026

ఇక్కడ వందల ఏళ్లుగా వర్షం కురవలేదు!

image

ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారి ఒకటి. ఆశ్చర్యకరంగా ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్లుగా ఒక్క చుక్క వర్షం కూడా కురవలేదు. విపరీతమైన పొడి వాతావరణం వల్ల ఇక్కడ జీవరాశి మనుగడ సాగించడం చాలా కష్టం. కనీసం గడ్డి కూడా మొలవదు. భూమిపై అంగారక గ్రహం వంటి పరిస్థితులు ఉండే ఏకైక ప్రదేశం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 12, 2026

జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

image

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.

News March 12, 2026

గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా!

image

గ్యాస్‌ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPGకి ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్‌లో 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. రోజూ 50Lసిలిండర్లు సరఫరా చేస్తున్నామంది.