News August 26, 2025

30న ఒంగోలులో జాబ్ మేళా.. జీతం ఎంతంటే.!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని ఉపాధి ఆఫీస్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. టాటా ఎలక్ట్రానిక్స్, హీరో మోటో కార్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, రిలయన్స్ జియో ఇన్ఫో కం లిమిటెడ్ వంటి కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35ఏళ్ల యువతీ యువకులు పాల్గొనాలని, ఎంపికైనవారికి రూ.19500 జీతం ఉంటుందన్నారు.

Similar News

News August 27, 2025

డ్రోన్ కెమెరా పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

image

డ్రోన్ కెమెరాలతో శాంతిభద్రతల పరిరక్షణ ఆధునిక పద్ధతులతో సాగుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్కాపురం మండలం కోల భీమినిపాడుకు చెందిన పోలిరెడ్డి డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీకి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ డ్రోన్ కెమెరాను మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎస్పీ అందజేశారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు తప్పిపోయిన ఘటనలో డ్రోన్ కెమెరా ఉపయోగపడిందన్నారు.

News August 26, 2025

ప్రకాశం: బార్ల దరఖాస్తుల గడువు పెంపు.!

image

ప్రకాశం జిల్లాకు ఓపెన్ కేటగిరిలో కేటాయించబడ్డ 26 బార్ల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ముందుగా 28వ తేదీ గడువు ఉండగా, ప్రభుత్వం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ బార్లకు 30వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

News August 26, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు.. ఎస్పీ కీలక సూచన.!

image

ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ మంగళవారం కీలక సూచన చేశారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావులేకుండా ప్రజలు పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఏవైనా అనుకోని ఘటనలు తలెత్తితే.. 112, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.