News April 2, 2024
కట్నంలో ‘ఫార్చునర్’ లేదని కొట్టి చంపాడు..

UPలోని నోయిడాలో ఘోరం జరిగింది. కరిష్మాకు వికాస్తో 2022లో పెళ్లయింది. అప్పుడు రూ.11లక్షల బంగారం, ఓ SUV కారు కట్నం ఇచ్చారు. అవి చాలవని భావించిన వికాస్ అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఓ కూతురు పుట్టాక వేధింపులు రెట్టింపయ్యాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ.10లక్షలిచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫార్చునర్ కారు, రూ.21లక్షల నగదు ఇవ్వాలని ఆమెను కొట్టి చంపాడు. కేసు నమోదైంది.
Similar News
News January 25, 2026
కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.
News January 25, 2026
శుభ సమయం (25-1-2026) ఆదివారం

➤ తిథి: శుద్ధ సప్తమి రా.9.09 వరకు
➤ నక్షత్రం: రేవతి మ.12.12 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.30-10.18 వరకు, ఉ.11.14-12.09 వరకు, మ.2.01-మ.4.14 వరకు
➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
➤ యమగండం: మ.12.00-మ.1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.15-5.00 వరకు
➤ వర్జ్యం: లేదు
➤ అమృత ఘడియలు: ఉ.9.55-11.26 వరకు
News January 25, 2026
కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.


