News April 2, 2024
కట్నంలో ‘ఫార్చునర్’ లేదని కొట్టి చంపాడు..

UPలోని నోయిడాలో ఘోరం జరిగింది. కరిష్మాకు వికాస్తో 2022లో పెళ్లయింది. అప్పుడు రూ.11లక్షల బంగారం, ఓ SUV కారు కట్నం ఇచ్చారు. అవి చాలవని భావించిన వికాస్ అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఓ కూతురు పుట్టాక వేధింపులు రెట్టింపయ్యాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ.10లక్షలిచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫార్చునర్ కారు, రూ.21లక్షల నగదు ఇవ్వాలని ఆమెను కొట్టి చంపాడు. కేసు నమోదైంది.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


