News August 26, 2025
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిషా, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, ముఖ్యంగా నాగావళి పరీవాహక మండలాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్.కోట, నెల్లిమర్ల మండలాల్లో రేపు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
Similar News
News August 27, 2025
PM సూర్యఘర్లో జిల్లాకు 8వ స్థానం: JC

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.
News August 26, 2025
కొత్తవలసలో అత్యధిక వర్షపాతం

మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు విజయనగరం డివిజన్లో అత్యధికంగా కొత్తవలసలో65.8mm(క్యూములేటివ్) వర్షపాతం కురిసినట్లు ఏఎస్ఓ రామకృష్ణ రాజు తెలిపారు. నెల్లిమర్లలో 61.2mm, జామిలో 55.2mm, విజయనగరంలో 50.8mm, భోగాపురంలో 48.8mm, పూసపాటిరేగలో 48.2mm, డెంకాడలో 45.6mm, ఎస్.కోటలో 37.8mm, ఎల్.కోటలో 29.2mm, వేపాడలో 26.2mm, బొండపల్లిలో 19.4 mm వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.
News August 26, 2025
VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.