News August 26, 2025
టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.
Similar News
News August 27, 2025
నెలాఖరున రోహిత్, రాహుల్కు యోయో టెస్ట్?

ఈ నెల 30-31 తేదీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజుల్లో వారు యోయో టెస్ట్లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టును క్లియర్ చేసేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం బీసీసీఐ యో యో టెస్ట్ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను మరింత ఫిట్, స్ట్రాంగ్గా ఉంచేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.
News August 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 27, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు ✒ ఇష: రాత్రి 7.48 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.