News April 2, 2024

వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7240

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా.. మంగళవారం రూ.7240 పలికింది. అయితే పత్తి ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి సరైన ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 20, 2026

WGL: ‘ఈనెల 23న ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు’

image

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.

News March 20, 2026

యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.

News March 20, 2026

బడ్జెట్‌లో వరంగల్‌కు అన్యాయం.. మంత్రి స్పందించాలి: బీజేపీ

image

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్‌కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.