News August 26, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం.. సీపీకి ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్లో ఈరోజు సీపీ గౌస్ ఆలంకు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర సందర్భంగా తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెట్రోల్ పోసి, నిప్పు అంటించిన బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Similar News
News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.
News August 27, 2025
వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్ను అరికట్టాలని సూచించారు.
News August 27, 2025
44 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం

పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు లక్ష్మీనారాయణ. సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మీనారాయణ 44 ఏళ్ల వయసులో తాజాగా విడుదలైన డీఎస్సీ ఫలితాలలో రెండు విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీజీటీ హిందీ విభాగంలో 76.31 మార్కులతో 45 జోనల్ ర్యాంక్, ఎస్ఏ హిందీ విభాగంలో 69.31 మార్కులతో జిల్లా స్థాయి 65వ ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలిపారు.