News August 26, 2025
సిరిసిల్ల: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. రామగిరి సతీశ్(35) అనే వ్యక్తి ఇటీవల బోరు వేసి, వరి కోత ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అప్పులు చేశాడన్నారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఈనెల 21న పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందాడని, కేసు నమోదు చేశామని చెప్పారు.
Similar News
News August 27, 2025
జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
News August 27, 2025
టిష్యూ, యాపిల్స్తో వినాయకులు.. చూశారా?

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్పుర్లో 1,500 కేజీల యాపిల్స్తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్లోని సూరత్లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.
News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.