News August 27, 2025
పెద్దపల్లి: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చర్యలు: దీపక్ జాన్

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాస్టర్లతో సమావేశం నిర్వహించి, చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువపత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన వినతులను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుతోపాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News August 27, 2025
DSCలో ఐదు ఉద్యోగాలు సాధించిన చేనేత కుమారుడు

ఉరవకొండకు చెందిన వరలక్ష్మి, ఎర్రిస్వామి కుమారుడు శ్రీనివాసులు ఇటీవలే విడుదలైన DSC ఫలితాలలో 5 ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను కనబరిచారు. ఈ విజయం సాధించడానికి తన తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని అభ్యర్థి తెలిపారు. తను DSCలో SA, TGT మ్యాథ్స్, SA, TGT ఫిజిక్స్, TGT సైన్స్, SGT విభాగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు చేనేతలు.
News August 27, 2025
జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
News August 27, 2025
టిష్యూ, యాపిల్స్తో వినాయకులు.. చూశారా?

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్పుర్లో 1,500 కేజీల యాపిల్స్తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్లోని సూరత్లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.