News August 27, 2025

గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

image

గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల అటవీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకం కింద ఈ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

Similar News

News August 27, 2025

బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు: ఆవులయ్య

image

నూతన బార్ పాలసీ 2025-28 కింద బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 29 వరకు పొడిగించినట్లు జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ అధికారి ఆవులయ్య తెలిపారు. లాటరీ డ్రా తేదీని ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు మార్చినట్లు ఆయన చెప్పారు. ఏలూరు కలెక్టర్ ఆధ్వర్యంలో గోదావరి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ లాటరీ నిర్వహించబడుతుందన్నారు.

News August 27, 2025

ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచనలు పాటించాలి: SP

image

జిల్లాలోని వినాయక మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100, 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. మండపాల ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 27, 2025

VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.