News August 27, 2025

GVMC పరిధిలో రూ.1,015 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు

image

GVMC పరిధిలో రూ.1015 కోట్ల అభివృద్ధి పనులకు అక్టోబరులోగా టెండర్లు పిలవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో మంగళవారం జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.మూడునాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు.‌ ప్రజలకు సౌకర్యవంతంగా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 27, 2025

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాందుడుకి విశాఖ స్పెషల్ పోక్సోకోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో భీమిలి మండలానికి చెందిన సరగడ సన్యాసిరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరం రుజువుకావడంతో కోర్టు పై విధంగా శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

News August 27, 2025

విశాఖలో సీఎం పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్‌లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.

News August 26, 2025

విశాఖలో C.M. పర్యటన ఖరారు

image

C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.