News April 2, 2024

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో వసూలైన ఆదాయ వివరాలు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లలో వసూలైన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం మార్కెట్ రూ.2,761 లక్షలు, వైరా మార్కెట్ రూ.578.59లక్షలు, కల్లూరు మార్కెట్ రూ.484.25 లక్షలు, సత్తుపల్లి మార్కెట్ రూ.478.37 లక్షలు, మధిర మార్కెట్ పరిధిలో రూ.455.03 లక్షలు, ఏన్కూరు మార్కెట్ రూ.449.99 లక్షలు నేలకొండపల్లి మార్కెట్ రూ.391.08లక్షలు, మద్దులపల్లికి రూ.182.39లక్షల ఆదాయం నమోదైంది.

Similar News

News March 16, 2026

భవిత కేంద్రాల పనులు వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (దివ్యాంగులను) సాధారణ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడమే ‘భవిత’ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కొణిజర్ల మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని, చిన్నమునగాల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలతో నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 15, 2026

విద్యుత్‌ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

image

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 15, 2026

BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

image

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.