News August 27, 2025

సిద్దిపేట: చరిత్రలో చీకటి రోజు.. 84 మంది మృతి

image

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్‌పల్లికి చరిత్రలో ఒక రక్తపు పేజీ ఉంది.. పూర్వపు WGL మద్దూరు(M)లోని ఈ గ్రామం 1948 ఆగస్టు 27న రజాకార్ల క్రూరత్వానికి వేదికైంది. గ్రామస్థుల పోరాట పటిమ చూసి భయపడిన రజాకార్లు ప్రతీకారంతో గ్రామంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నిజాం సైన్యం 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ఈ ఊచకోత తెలంగాణ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలింది.

Similar News

News August 27, 2025

పీలేరు: వినాయక చవితి వేడుకల్లో అపశృతి

image

పీలేరులోని బీవీ రెడ్డి కాలనీ సెంటర్లో బుధవారం వినాయక చవితి వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. గంధంతో తయారైన నాట్య వినాయకుడి మండపంలో హారతి ఇస్తుండగా బలమైన గాలికి హారతి అలంకరణ వస్త్రంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.

News August 27, 2025

సినిమా ముచ్చట్లు

image

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్‌పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం

News August 27, 2025

వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ధరలు

image

జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.