News August 27, 2025

కామారెడ్డి: ‘ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం’

image

ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం సమష్టిగా పోరాడాలని ఎంప్లాయీస్ JAC కామారెడ్డి జిల్లా ఛైర్మన్, TNGO జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో TGEJAC విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. న్యాయమైన హక్కులు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

Similar News

News August 27, 2025

పీలేరు: వినాయక చవితి వేడుకల్లో అపశృతి

image

పీలేరులోని బీవీ రెడ్డి కాలనీ సెంటర్లో బుధవారం వినాయక చవితి వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. గంధంతో తయారైన నాట్య వినాయకుడి మండపంలో హారతి ఇస్తుండగా బలమైన గాలికి హారతి అలంకరణ వస్త్రంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.

News August 27, 2025

సినిమా ముచ్చట్లు

image

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్‌పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం

News August 27, 2025

వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ధరలు

image

జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.