News August 27, 2025

తిరుపతి TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా శ్రీధర్ వర్మ?

image

తిరుపతి TDP పార్లమెంట్ అధ్యక్షుడిగా బి.శ్రీధర్ వర్మ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. జోన్-4 మీడియా కోఆర్డినేటర్‌గా విస్మృత సేవలు అందించిన ఆయనకు జిల్లాలోని ఎక్కువమంది ఎమ్మెల్యేలు, నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. నిన్న మంత్రి సబితా నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో పలువురు ఆశావాహులు బయోడేటాలు సమర్పించగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Similar News

News August 27, 2025

HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

image

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.

News August 27, 2025

HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

image

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.

News August 27, 2025

రాజంపేట: ముఖ్యమంత్రి పర్యటన కోసం స్థలాల పరిశీలన

image

రాజంపేటలో సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా అధికారులు బుధవారం రాజంపేటలో స్థలాలను పరిశీలించారు. అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. కొత్త బోయిన పల్లె, తాళ్లపాక, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు.