News August 27, 2025
విశాఖ: ‘సారీ నేను బతకలేను’

పెదగంట్యాడలో బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాలిక (13) ఇంటి నుంచి వెళ్లిపోతూ చీటీ రాసింది. అందులో ‘నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది. ఇన్ని రోజులు చాలా భరించాను. ఇప్పుడు నేను ఇంక దీన్ని భరించలేను. సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను’ అని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News August 27, 2025
విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం విశాఖ రానున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని సర్క్యూట్ హౌస్లో బస చేస్తారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబుతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 11:10 కి విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News August 27, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 29న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలపై పోలీస్ కమిషనర్తో చర్చించారు. అనంతరం రుషికొండ రాడిసన్ రిసార్ట్ను సందర్శించి అక్కడ జరగబోయే గ్రిఫిన్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. గ్రీన్ రూమ్, ప్రధాన సమావేశం జరిగే ప్రాంతాలను పరిశీలించారు.
News August 27, 2025
ఎలక్ట్రిక్ లోకోషెడ్లో ‘కవచ్’ లోకోను ప్రారంభించిన DRM

విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.