News August 27, 2025
NLG: వినాయక చవితి పూజా పత్రికి డిమాండ్

వినాయక చవితి పూజా పత్రి విక్రయాలు ఉమ్మడి NLG జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లా, మండల కేంద్రాల రైతుబజార్లు, రోడ్లపై రద్దీ ఉంది. మారేడు పత్రి, పచ్చిగరుక, మర్రి ఊడలు, కరక్కాయ, ఎలక్కాయలకు చాలా డిమాండ్ ఉంది. నైవేద్యంగా సమర్పించే పచ్చగూరలు, అరటి, చెరుకు కొమ్మలు కొంటున్నారు. పూల ధరలకూ రెక్కలొచ్చి బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, లూజ్ పువ్వులకు డిమాండ్ పెరిగింది. వెదురు పాలవెల్లి, కలర్స్ పల్లకిలు ఉన్నాయి.
Similar News
News August 27, 2025
జనగామ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్అండ్బీ, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్నా వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.
News August 27, 2025
అంతర్గాం: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

అంతర్గాం (M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 గేట్ల ద్వారా 55, 531 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు నది వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
News August 27, 2025
కడపలో పండుగ రోజు విషాదం

కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.