News August 27, 2025
కొండాపురంలో యాక్సిడెంట్.. మృతులు వీరే.!

కొండాపురంలోని లావునూరు రహదారిలో మంగళవారం రాత్రి బైకు – కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.
Similar News
News August 28, 2025
కడప: శనగలతో వినాయకుడు

వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ కడప ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు. స్వామిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు
News August 27, 2025
కడపలో పండుగ రోజు విషాదం

కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 27, 2025
కడప ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోక్ సభ స్పీకర్

ఎక్స్ వేదికగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కొంతమంది ప్రముఖులు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు పేరున రీ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.