News August 27, 2025

జడ్చర్ల: వైద్యం అందక మృతి.. హైవేపై బంధువుల ధర్నా

image

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ఓ ప్రాణం పోయిందని కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం హైవేపై ధర్నా చేశారు. పీర్లపల్లి తండాకు చెందిన రవి నాయక్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యం అందక ప్రాణాలు దక్కలేదని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని హైవేపై మృతదేహంతో బైఠాయించారు.

Similar News

News August 27, 2025

కొత్త మొల్గరలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ మండలం పారుపల్లి 76.3, MBNR అర్బన్ 62.0, భూత్పూర్ 55.3, మహమ్మదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, నవాబుపేట 34.5, బాలానగర్ 31.3, మూసాపేట 28.0, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 27, 2025

MBNR: పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

image

అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. Sep 5న రాత్రి 7గం.కు బస్ MBNR నుంచి బయలుదేరుతుందని, 6న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం చేరుకొని అరుణాచలం గిరిప్రదక్షిణ, 8న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600 (ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 99592 26286, 94411 62588 ఫోన్ చేయాలన్నారు.Web:https://tsrtconline.in

News August 27, 2025

పండుగను శాంతియుతంగా జరుపుకోండి- SP

image

వినాయక చవితి పండుగను అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించి, సామాజిక సమన్వయం, పరిశుభ్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, పోలీసు సిబ్బంది పండుగ సమయంలో నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.