News August 27, 2025

వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షం

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోం. ఆగస్టు 27న ఉ.8:30 నుంచి సా.4 వరకు 107.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 30.5 మి.మీ. వర్షం కురిసింది. దుగ్గొండి 23.8, ఖానాపూర్ 15.3 నమోదైంది. అతి తక్కువగా ఖిల్లా వరంగల్ మండలంలో 0.5 మి.మీ. నమోదైంది.

Similar News

News August 27, 2025

గణపతి పల్లకి మోసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని

image

వేయి స్తంభాల గుడిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య గణపతి మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం చుట్టూ గణపతి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పల్లకిని భుజాలపై మోశారు.

News August 27, 2025

వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ధరలు

image

జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.

News August 27, 2025

వరంగల్: 4 రోజుల్లో రేషన్ పునః ప్రారంభం..!

image

పేద ప్రజలకు చౌక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం సెప్టెంబర్ నుంచి తిరిగి పున:ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఒకేసారి బియ్యం పంపిణీ చేయగా ఆ గడువు పూర్తవుతోంది. జిల్లాలో 509 రేషన్ దుకాణాలు ఉండగా, పాత కార్డులు 2,66,429, కొత్త కార్డులు 16,251 ఉన్నాయి. ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేటలో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. పంపిణీ చేయాల్సిన బియ్యం 5,382,518 మెట్రిక్ టన్నులు.