News August 27, 2025
అమరావతిలో అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ?

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. ఇది 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన జ్ఞాన కేంద్రంగా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఈ లైబ్రరీని నిర్మించడానికి ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం ₹100 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
Similar News
News August 28, 2025
HYDలో ఎక్కడి నీరు అక్కడే ఇంకేలా హైడ్రా చర్యలు

ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని హైడ్రా ఓ రిపోర్టులో పేర్కొంది.
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.
News August 28, 2025
SRD: 31 వరకు DCEB ఫీజు చెల్లించుకోవాలి: డీఈవో

ఈనెల 31 వరకు DCEB ఫీజును చెల్లించుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల విద్యాదికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, SO, ZP, GOVT, MODEL, KGBV అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు 31 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు కట్టిన తర్వాత రిసీప్ట్, ఫిగర్ స్టేట్మెంట్, స్కూల్ రికగ్నిషన్ కాపీ, కవరింగ్ లెటర్లను జిల్లా విద్యాధికారి ఆఫీసులో సమర్పించాలన్నారు.