News August 27, 2025
మెదక్: రేపు విద్యాసంస్థలకు సెలవు..!

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనకు అనుగుణంగా సమన్వయం పాటించాలని సూచించారు.
Similar News
News August 28, 2025
విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన

మంత్రి నారా లోకేశ్ 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం గురువారం రాత్రి 8:20కు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుని ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. శుక్ర, శనివారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 1:45కు ఎయిర్ పోర్ట్కు చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News August 28, 2025
వరద బాధితులను కాపాడేందుకు వైమానిక హెలికాప్టర్లు: బండి

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోని వరద బాధితులను రక్షించేందుకు వైమానిక హెలికాప్టర్లను పంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.
News August 27, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సూర్యాపేట: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ ప్రతిమ వద్ద ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాల కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.