News August 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వర్షపాతం నమోదు వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు బుధవారం సాయంత్రం ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట 132, గంభీరావుపేట 92.5, ఎల్లారెడ్డిపేట 40, తంగళ్ళపల్లి 31.3, సిరిసిల్ల 20.5, ముస్తాబాద్ 20, కొన్నారావుపేట 14.5, వీర్నపల్లి 11.5, రుద్రంగి 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంటలో ఎక్కువగా, రుద్రంగిలో తక్కువగా వర్షపాతం నమోదయింది.
Similar News
News August 28, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
News August 28, 2025
విజయవాడ: మేనేజర్ జాబ్స్.. రూ. 40 వేల జీతం

విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్లో కాంట్రాక్ట్ పద్ధతిన జిల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మేనేజర్ ఉద్యోగాల(6) భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత కోర్సులలో బీటెక్, పీజీ చేసి మూడేళ్ల అనుభవమున్న అభ్యర్థులు SEPT 6లోపు https://apts.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.
News August 28, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన.!

ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని APSDMA బుధవారం ‘X’ వేదికగా వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.