News August 28, 2025
విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన

మంత్రి నారా లోకేశ్ 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం గురువారం రాత్రి 8:20కు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుని ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. శుక్ర, శనివారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 1:45కు ఎయిర్ పోర్ట్కు చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్తారు.
Similar News
News August 28, 2025
విజయవాడ: మేనేజర్ జాబ్స్.. రూ. 40 వేల జీతం

విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్లో కాంట్రాక్ట్ పద్ధతిన జిల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మేనేజర్ ఉద్యోగాల(6) భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత కోర్సులలో బీటెక్, పీజీ చేసి మూడేళ్ల అనుభవమున్న అభ్యర్థులు SEPT 6లోపు https://apts.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.
News August 28, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన.!

ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని APSDMA బుధవారం ‘X’ వేదికగా వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News August 28, 2025
వ్యవసాయ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో దేవనకొండ మండలం కొత్తపేటకి చెందిన పీరా సాహెబ్, షాజిదాబీ దంపతుల కూతురు మస్తాన్ బి సత్తా చాటారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ కూతురు ఉన్నత శిఖరాలను చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదివించారు. మస్తాన్ బి డీఎస్సీ ఫలితాలలో 77.88 మార్కులు సాధించి ఎస్జిటి పోస్ట్కు ఎంపికైంది. తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.