News August 28, 2025
తిరుపతి: అంతరించిపోతున్న పక్షులపై స్టడీ

రేడియేషన్ కారణంగా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయన్న సంగతి పలు పరిశీలనల్లో వెల్లడైంది. వాటిపై అధ్యాయనం చేయడానికి తిరుపతి ఫారెస్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి ఐఐటీతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టి, పక్షుల పరిరక్షణకు దోహదపడాలనేది తమ లక్ష్యమని ఫారెస్ట్ డీఎఫ్వో వివేక్ తెలిపారు.
Similar News
News August 28, 2025
గుంటూరు జిల్లా TOP NEWS TODAY

☞ లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి
☞ ఐకానిక్ టవర్ల నుంచి నీరు తోడివేత
☞ గుంటూరు: రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం
☞ చిలకలూరిపేటలో అమెరికన్ డైమండ్స్తో వినాయక విగ్రహం
☞ పులిచింతల వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
☞ మిస్సింగ్ కేసులను ఛేదించాలి: ఎస్పీ
☞ ఈవీఎంల భద్రత పక్కాగా ఉండాలి : కలెక్టర్
☞ అంబటి మురళీ ధూళిపాళ్లపై బురద జలుతున్నారు
☞ మంగళగిరిలో ఫోన్ దొంగల అరెస్ట్
News August 28, 2025
అల్లర్లు రేకెత్తించే పాటలు పెడితే చర్యలు: ఎస్పీ

వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గురువారం వినాయక కమిటీ సభ్యులకు ఆయన తగు సూచనలు చేశారు. నిమజ్జన సమయాలలో డీజే, అసభ్యకర నృత్య ప్రదర్శనలు, అల్లర్లు సృష్టించే పాటలు పెట్టరాదన్నారు. పోలీస్ శాఖ వారు సూచించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే వినాయక నిమజ్జనాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
News August 28, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

TG: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న ఆయన రిటైర్ కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో సర్వీసును 7 నెలలు పొడిగించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.