News August 28, 2025
లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం

గడచిన 24 గంటలలో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పెద్దకొత్తపల్లిలో 37.8, తెలకపల్లిలో 19.6, బిజినేపల్లిలో 16.2, నాగర్కర్నూలులో 13.2, ఊరుకొండలో 11.4, అచ్చంపేటలో 13.4, తాడూరులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
Similar News
News August 28, 2025
VAD అంటే ఏంటి?

Vertebral artery dissection (VAD) అనేది వెన్నెముక ధమని లోపలి పొరల్లో సంభవించే చీలిక. ఈ ధమని మెదడుకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో ఒకటి. VAD వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ రావొచ్చు. హైబీపీ, స్మోకింగ్, మైగ్రేన్ లాంటి కారణాలతో VAD వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మాట్లాడేందుకు ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాను VAD నుంచి కోలుకుంటున్నానని తెలంగాణ IAS <<17546623>>స్మిత<<>> ట్వీట్ చేశారు.
News August 28, 2025
WNP: భూభారతి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

భూభారతిలో పెండింగ్లో ఉన్న రైతు అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మండల తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News August 28, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.