News August 28, 2025
కొత్తపల్లిని రెవెన్యూ గ్రామంగా మారుస్తా: MP

నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్, ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.
Similar News
News August 29, 2025
ఇచ్చోడ: ఓటర్ ఐడిలో మార్పులు.. నిందితులకు రిమాండ్: సీఐ

ఓటరు ఐడి నుంచి ఓట్లను వేరే గ్రామానికి మార్చిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. అడేగామబికి చెందిన మాజీ సర్పంచి వనిత, భర్త సుభాశ్ ఓట్లను కొందరు రెవెన్యూ అధికారి సహాయంతో వేరే గ్రామానికి మార్చారన్నారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులు విశాల్, అచ్యుత్, ధనరాజ్, రెవెన్యూ ఆర్ఐ హుస్సేన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
News August 28, 2025
సీఐ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

జైనథ్ సీఐ సాయినాథ్ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీఐ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆస్పత్రికి వెళ్లి సీఐ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి పలు వైద్య పరీక్షలను చేయించారు. సీఐతో పాటు గాయపడ్డ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
సీఐ, డ్రైవర్ పరిస్థితిపై ఎస్పీ అరా

ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జైనథ్ సీఐ సాయినాథ్, డ్రైవర్ పరిస్థితిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, డ్రైవర్ను ఎస్పీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఉన్నారు.