News August 28, 2025
MNCL: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకం

బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్లతో పాటు 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 10 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 29, 2025
జనగామ: యాంకర్ లోబోకు జైలు శిక్ష

యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రఘునాథపల్లి ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. 2018లో రఘునాథపల్లి మండలంలో అతివేగంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది.
News August 29, 2025
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలి: DGP

నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
News August 29, 2025
మంథని: ‘లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

గోదావరినదిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మంథని పట్టణంలోని గోదావరితీరాన్ని ఆయన పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.