News August 29, 2025
సోషల్ మీడియా కుట్రలను తిప్పికొట్టాలి: పవన్ కళ్యాణ్

AP: దేశ చరిత్రలోనే జనసేన విజయం ఓ మైలురాయి అని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనమని చెప్పారు. సోషల్ మీడియాలో కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 15 ఏళ్లు ఏ పదవీ లేకుండా ఉన్నానని, జనసేన అంటేనే పోరాటాలకు స్ఫూర్తి అని చెప్పారు. కూటమి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News September 1, 2025
మరో 24 గంటల్లో అల్పపీడనం: APSDMA

AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
News September 1, 2025
పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: CM రేవంత్

TG: గత ఏడాది పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీశారు. ఇటీవల వరదలతో ఏర్పడ్డ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. NDRFతో పనిలేకుండా SDRF సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రోడ్ల డ్యామేజ్పైనా సమగ్ర నివేదిక రూపొందించడంతో పాటు HMDA పరిధిలోని చెరువులను వెంటనే నోటిఫై చేయాలన్నారు.
News September 1, 2025
CBI విచారణపై సస్పెన్స్!

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.