News August 29, 2025

ఓకే పాఠశాలకు చెందిన ఏడుగురికి టీచర్ ఉద్యోగాలు

image

మహానంది మండ‌లం గోపవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు టీచ‌ర్ ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐదుగురికి ఎస్టీజీ, ఇద్దరికి పీఈటీ పోస్టులు వచ్చాయి. త‌మ త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చదివించార‌ని, వారి క‌ష్టం వృథా కాలేద‌ని టీచ‌ర్ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు పేర్కొన్నారు. వీరిని పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు పి.నాగశేషుడు, గ్రామ‌స్థులు అభినందించారు.

Similar News

News September 1, 2025

సీఎంకు భద్రాద్రి ఎమ్మెల్యేల వినతి

image

గిరిజన నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా గిరిజన శాసనసభ్యుల కోరికపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

News September 1, 2025

జగన్‌తో ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు

image

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.

News September 1, 2025

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.