News August 29, 2025
గుంటూరులో భారీ వర్షాలు.. సగటు 40.6 మి.మీ.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు అత్యధికంగా దుగ్గిరాలలో 58.6 మి.మీ, కనిష్టంగా మేడికొండూరులో 15.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకానిలో 57, చేబ్రోలు 48.4, ప్రత్తిపాడు 48.2, గుంటూరు పశ్చిమ 46.2, తాడేపల్లి 45.6 మి.మీ. వర్షం కురిసింది. పొన్నూరులో 22.6 మి.మీ. నమోదు. జిల్లాలో ఇప్పటి వరకు 276.8 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణాన్ని మించిపోయింది.
Similar News
News September 1, 2025
GNT: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు మిర్చియార్డులో విషాదం చోటుచేసుకుంది. యార్డులోకి వెళ్తున్న లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 1, 2025
రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు 7వ స్థానం

రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్లోడ్ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
News September 1, 2025
సిరిపురంలో రికార్డు సృష్టించిన లడ్డూ వేలం

మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. ఈ లడ్డూ రూ. 5,01,000లకు అమ్ముడై గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. ప్రతి సంవత్సరం జరిగే వినాయక మహోత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సిరిపురం గ్రామానికి చెందిన కడియాల పరమేశ్వరరావు (అశోక్) భక్తిశ్రద్ధలతో లడ్డూను దక్కించుకున్నారు.