News April 2, 2024
టాటా మోటార్స్కు చైనా ఈవీలతో సవాల్!

కేంద్రం ఇటీవల తెచ్చిన ఈవీ కొత్త పాలసీతో టెస్లా వంటి ఫారిన్ ఈవీ కంపెనీలు భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియరైంది. ఈ నిర్ణయం దేశీయంగా ఈవీ రంగంలో టాప్లో ఉన్న టాటాకు సైతం ఊతమిచ్చిందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీ BYD అందుబాటు ధరలకు ఈవీలను తెచ్చే ప్లాన్లో ఉందట. ఈ నేపథ్యంలో టాటాకు చైనా సంస్థలు సవాల్గా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 22, 2025
బాపట్ల: ‘ఈ అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తల వేతనం పెరుగనుంది’

బాపట్ల జిల్లాలోని 16 మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మార్పుతో కార్యకర్తల గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500కు పెరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్పూర్లో రూ.70 కోట్లతో క్లీన్ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.


