News April 2, 2024
టాటా మోటార్స్కు చైనా ఈవీలతో సవాల్!

కేంద్రం ఇటీవల తెచ్చిన ఈవీ కొత్త పాలసీతో టెస్లా వంటి ఫారిన్ ఈవీ కంపెనీలు భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియరైంది. ఈ నిర్ణయం దేశీయంగా ఈవీ రంగంలో టాప్లో ఉన్న టాటాకు సైతం ఊతమిచ్చిందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీ BYD అందుబాటు ధరలకు ఈవీలను తెచ్చే ప్లాన్లో ఉందట. ఈ నేపథ్యంలో టాటాకు చైనా సంస్థలు సవాల్గా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News April 21, 2025
కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్స్కీ

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.
News April 21, 2025
IPL రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే?

ఐపీఎల్లో కనిపిస్తున్న రోబోటిక్ డాగ్(కెమెరా)కు పేరు పెట్టారు. ఇటీవల నిర్వహించిన పోల్లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ‘చంపక్’ అని పేరు పెట్టినట్లు IPL అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ‘మీట్ చంపక్’ అని రాసుకొచ్చింది. ఆటగాళ్లతోనూ, చీర్ లీడర్స్తోనూ ఈ రోబోటిక్ డాగ్ సందడి చేసిన వీడియోలు వైరలయ్యాయి.
News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్కు ఎంపీ రిప్లై ఇచ్చారు.