News August 29, 2025

గ్రామ/వార్డు సచివాలయాలపై పర్యవేక్షణ

image

AP: గ్రామ/వార్డు సచివాలయాల పాలనపై ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టనుంది. సచివాలయాల శాఖ నుంచి ఆరుగురు, డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా, 17 మంది జాయింట్ డైరెక్టర్/DLDA స్థాయి వారిని సచివాలయ శాఖ అధికారులుగా నియమిస్తారు. మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని.. మున్సిపాలిటీల్లో ఇద్దరు అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తారు.

Similar News

News January 1, 2026

నీటిపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా?: హరీశ్

image

TG: నదీ జలాలపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా? అని BRS నేత హరీశ్ CM రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చారు, సుంకిశాలను ఎలా కూల్చారో చూపిస్తారా? కృష్ణాపై హక్కులను KRMBకి ఎలా అప్పగించారో చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా? అని నిలదీశారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.

News January 1, 2026

DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

image

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.

News January 1, 2026

FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

image

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.