News April 2, 2024

డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం: సీఎం జగన్

image

AP: తాము ఐదేళ్లుగా విశ్వసనీయమైన పాలన అందించామని సీఎం జగన్ తెలిపారు. మదనపల్లిలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించాం. మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేశాం. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు కళ్ల ముందు కనిపిస్తోంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం. దీనికి మీరంతా సిద్ధమా? 58 నెలల్లో మంచి జరిగితేనే ఓటు వేయాలని మనం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

రాజ్యాంగానికి రాహుల్, రేవంత్ తూట్లు: KTR

image

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ <<18864508>>క్లీన్‌చిట్<<>> ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే. రాహుల్, రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. జంప్ జిలానీలకు, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా BRS పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.

News January 15, 2026

PhonePe రూ.5వేల గిఫ్ట్.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

image

సంక్రాంతి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ వైరల్‌గా మారింది. ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్- అన్ని వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్‌ షేర్ అవుతోంది. యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులకు ఆశపడి లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News January 15, 2026

ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

image

ఇరాన్‌లో పాలనాపగ్గాలు మారితే భారత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.