News April 2, 2024

డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం: సీఎం జగన్

image

AP: తాము ఐదేళ్లుగా విశ్వసనీయమైన పాలన అందించామని సీఎం జగన్ తెలిపారు. మదనపల్లిలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించాం. మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేశాం. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు కళ్ల ముందు కనిపిస్తోంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం. దీనికి మీరంతా సిద్ధమా? 58 నెలల్లో మంచి జరిగితేనే ఓటు వేయాలని మనం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

కేసీఆర్‌పై జనవరి 19 వరకు చర్యలొద్దు: HC

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా KCRపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వచ్చే ఏడాది JAN 19 వరకు ఆయనతోపాటు హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను JAN 19కి వాయిదా వేసింది.

News November 13, 2025

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 2,3 రోజుల్లో క్లారిటీ

image

TG: రేపటితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగియనుండటంతో లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై 2,3 రోజుల్లో CM రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. రిజర్వేషన్లను కోర్టు అంగీకరించకపోతే పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లనుంది.

News November 13, 2025

బీపీఎస్ గడువు పొడిగింపు!

image

AP: అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2025 ఆగస్టు 31లోపు కట్టిన ఇళ్లు, భవనాలను బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)లో క్రమబద్ధీకరించుకునేలా అవకాశమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. 4 నెలల్లోగా అప్లై చేసుకోవాలని తెలపింది. ఈ పథకం ద్వారా 59,041 అనధికార నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వెబ్ సైట్: <>www.bps.ap.gov.in<<>>