News August 29, 2025
నేడు మెదక్ పర్యటనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరద నష్టం ప్రాంతాలను సందర్శించడానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మెదక్కు వస్తున్నారు. జిల్లా సరిహద్దులో గల పోచారం డ్యామ్, సర్దన గ్రామ పునరావాస కేంద్రాలు, మెదక్ పట్టణంలో పర్యటించనున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం తెలిపారు.
Similar News
News October 26, 2025
మెదక్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి..?

మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈనెల 27న మెదక్ పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో డ్రా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మద్యం పాలసీ 2025-27కు జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు రాగా రూ.42.60 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎవరికి దక్కుతుందో చూడాలి.
News October 26, 2025
31న మెదక్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్ఎస్ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
News October 26, 2025
మెదక్: నేడు స్వగ్రామానికి మృతదేహాలు

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తల్లీ, కూతురు మృతదేహాలు ఇవాళ రాత్రి వరకు స్వగ్రామానికి రానున్నాయి. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి(43), కుమార్తె చందన(23) బస్సు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను ఇవాళ సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శుక్రవారం నుంచి శివ్వాయిపల్లిలో విషాదం నెలకొంది.


