News April 2, 2024
జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్

AP: మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నారు. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News January 6, 2026
డాక్టర్కూ తప్పని కుల వివక్ష!

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. సికింద్రాబాద్కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.
News January 6, 2026
SIR, ECపై మరోసారి మమత ఫైర్

SIR, ECపై ప.బెంగాల్ CM మమత మరోసారి సంచలన కామెంట్లు చేశారు. BJP ఐటీ సెల్ డెవలప్ చేసిన మొబైల్ అప్లికేషన్లను WBలో ఎలక్టోరల్ రోల్ సవరణకు ఎన్నికల సంఘం చట్టవిరుద్ధంగా వినియోగిస్తోందని ఆరోపించారు. ‘SIR నిర్వహణలో అన్ని తప్పుడు చర్యలను EC అవలంబిస్తోంది. అర్హులైన ఓటర్లను చనిపోయినట్టు చూపుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విచారణకు పిలుస్తోంది. ఇది అన్యాయం, అప్రజాస్వామికం’ అని మమత ఫైరయ్యారు.
News January 6, 2026
రేపు పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: పోలవరం ప్రాజెక్టును CM చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 10AMకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్, డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పర్యవేక్షిస్తారు. తర్వాత అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. కాగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగింది.


