News August 30, 2025
ఇంటింటికి తిరిగి దరఖాస్తులు స్వీకరించండి: ఆర్డీఓ

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారి నుంచి ఇంటింటికి తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీఓ అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ డివిజన్లోని తొమ్మిది మండలాలు, మూడు మున్సిపాలిటీలలో ఏప్రిల్ 12, 2017 నుంచి ఈ నెల 23 వరకు 2,249 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ పథకంపై అవగాహన కల్పించి దరఖాస్తులను సేకరించాలని సూచించారు.
Similar News
News September 3, 2025
పోలీసుల సూచనలను పాటించాలి: నల్గొండ ఎస్పీ

గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ నిర్వాహకులను కోరారు. చిన్నపిల్లలు, మహిళలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, గుంపుల వద్ద వాహనాలలో టపాకులు పేల్చవద్దని సూచించారు. నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని, స్వచ్ఛంద సేవకుల విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అత్యవసరమైతే 100, 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
News September 3, 2025
NLG: పంట నష్టం పై సర్వే..!

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.
News September 3, 2025
NLG: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 869కి చేరింది.