News August 30, 2025

ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్: ఎస్పీ

image

ప్రజలు ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గణపతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేసి బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు చేరువై వారి సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News September 4, 2025

ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ADB కలెక్టర్

image

ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదగడంలో, భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉన్నతస్థాయికి చేరాలంటే గురువు అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏఐ ద్వారా బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

News September 3, 2025

నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి: ఆదిలాబాద్ SP

image

గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

News September 3, 2025

వరద సహాయక చర్యలపై ఆదిలాబాద్ కలెక్టర్ సమీక్ష

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులపై కలెక్టర్ రాజర్షిషా బుధవారం అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల రవాణాను తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని వెంటనే అంచనా వేసి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.