News August 30, 2025
వినాయక నిమజ్జనంలో అపశృతి

సి.బెళగల్లో వినాయక నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దాసరి వీధిలో వినాయకుడిని ట్రాక్టరులో నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో క్రిష్ణదొడ్డి రోడ్డులోని చెరువు కట్టపై విద్యుత్ వైర్లు తగలడంతో ట్రాక్టరులో ఉన్న వారు షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో చంద్ర (19) ఆస్వస్థతకు గురికాగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడని తండ్రి రుద్రయ్య తెలిపారు.
Similar News
News August 30, 2025
న్యాయంపూడి జంక్షన్ వద్ద యాక్సిడెంట్

నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి హైవే జంక్షన్ వద్ద శనివారం రాత్రి కొబ్బరిలోడు ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడి ఎస్.రాయవరానికి చెందిన కర్రి వెంకట సూరి (45) అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కె.కుమారస్వామి చెప్పారు. మరో వ్యక్తి గాయపడగా ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
News August 30, 2025
KMR: జిల్లాలో దెబ్బతిన్న ఇండ్లకు సాయం

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్ల వివరాలను అధికారులు సర్వే ద్వారా సేకరిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 234 పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు, 1 పూర్తిగా కూలిపోయిన కచ్చా ఇంటికి ప్రభుత్వం సహాయనిధి మంజూరు చేసింది. మిగతా ఇండ్ల సర్వే పూర్తి చేసి, అర్హులైన వారికి కూడా త్వరలో సహాయం అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు.
News August 30, 2025
Fortune పవర్ఫుల్ ఉమన్ – 2025 వీళ్లే

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చున్ భారత వ్యాపార రంగంలో పవర్ఫుల్ ఉమన్ 2025 లిస్ట్ విడుదల చేసింది. ఇందులో FM నిర్మలా సీతారామన్, ముకేశ్ అంబానీ భార్య నీతా టాప్2లో ఉన్నారు. ఇక అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ రెడ్డి కూతుళ్లు శోభన, సంగీత, ప్రీతా, సునీత (బిజినెస్ సర్కిల్లో రెడ్డి సిస్టర్స్ అంటారు) 3, HCL ఫౌండర్ శివ నాడార్ కూతురు రోష్ని నాడార్ 4, నెట్ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా 5వ స్థానాల్లో నిలిచారు.