News August 30, 2025
దివంగత నేతలకు సంతాపం తెలపనున్న రాష్ట్ర శాసనసభ

నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృత చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సెషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉ.10:30 గంటలకు ఉప్పల్ మాజీ MLA దివంగత బండారు రాజిరెడ్డి, జూబ్లీహిల్స్ MLA దివంగత మాగంటి గోపీనాథ్లకు సంతాపం తెలపనున్నట్లు శాసనసభ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.
Similar News
News September 11, 2025
HYD: నకిలీ వెబ్సైట్లను గుర్తించడంపై ముందడుగు..!

HYDలో CipherCop-2025 ప్రారంభమైందని బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇది మొదటి జాతీయ హ్యాకథాన్ అన్నారు. వచ్చే 2 రోజుల్లో యువ మేధావులు పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో క్రిప్టో లావాదేవీలు గుర్తించడం, నకిలీ వెబ్సైట్లు, స్కామ్ యాప్లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్ను వెలికితీయడంపై సవాళ్లు స్వీకరిస్తారని చెప్పారు.
News September 11, 2025
HYD: ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News September 11, 2025
HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్కు అభినందనలు తెలిపారు.