News August 30, 2025
పగో జిల్లాలో 7 ఇసుక నిల్వ కేంద్రాల్లో ధరలు ఇవే

జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, వాటి విలువ వివరాలను కలెక్టర్ తెలిపారు. ఆచంటలో 20,020 మెట్రిక్ టన్నులు, టన్ను ఇసుక ధర రూ.444, భీమవరంలో 6,193 ఇసుక ఉండగా, రూ.581, నరసాపురంలో 2,403 ఇసుక ఉండగా రూ.581, పాలకొల్లులో 19,505 ఇసుక ఉండగా, రూ.556, తాడేపల్లిగూడెంలో 35,180 ఇసుక ఉండగా రూ.456, తణుకులో 7,878 ఇసుక ఉండగా, రూ.306, ఉండిలో 28,923 ఇసుక ఉండగా, రూ.550 చొప్పున అందుబాటులో ఉన్నాయి.
Similar News
News September 6, 2025
కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 6, 2025
ఈ-పంట నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జేసీ

ఈ-పంట నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉండి మండలం యండగండిలో ఈ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు మండలంలో 10,500 ఎకరాలకు గాను 9,000 ఎకరాల నమోదు పూర్తయిందని అధికారులు ఆయనకు తెలిపారు. యండగండి గ్రామంలో 1,300 ఎకరాలకు గాను 1,050 ఎకరాలు నమోదైనట్లు పేర్కొన్నారు.
News September 5, 2025
తణుకు: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ లభ్యం

తణుకులోని ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్లు తణుకు పోలీసులు తెలిపారు. అత్తిలి మండలం బల్లిపాడులో ఇందిరమ్మ కాలనీకు చెందిన కాకర్ల ఆదినారాయణ(65) గా గుర్తించారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ ఇంటికి వెళ్లకపోగా తణుకులో సూర్యాలయం వీధిలో శుక్రవారం రాత్రి హాస్య ఆసుపత్రి భవనం పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.