News April 2, 2024
మోదీతో రేవంత్ రహస్య ఒప్పందం: బాల్క సుమన్

TG: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని BRS నేత బాల్క సుమన్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ నుంచి రేవంత్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. మల్కాజిగిరి, చేవెళ్ల, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీపై బలహీన అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో ఉన్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి మోదీతో రహస్య ఒప్పందం చేసుకున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News April 21, 2025
16,347 పోస్టులు.. మరో UPDATE

APలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త సిలబస్ ప్రకారమే విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3 నుంచి పదో తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉండదు. DSCకి 80%, టెట్కి 20% వెయిటేజీ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉంటాయనే పూర్తి వివరాలను <
News April 21, 2025
ఎండల తీవ్రతతో జనవాణి వేళల్లో మార్పులు

AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.
News April 21, 2025
పోచంపల్లిలో అందాల భామల ర్యాంప్వాక్!

TG: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ <<16153019>>పోచంపల్లిలో<<>> పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్’ పేరుతో మే 15న అక్కడ నిర్వహించనున్న కార్యక్రమంలో ఇక్కత్ పట్టుచీరలు ధరించి ర్యాంప్వాక్ చేయనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాల స్టాల్స్ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.