News April 2, 2024
వేసవిలో ఈ ఆహారం తింటున్నారా?

వేసవిలో చాలామంది స్పైసీ ఫుడ్ తింటుంటారు. కానీ స్పైసీ, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అల్లం, మిరియాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల కడుపులో యాసిడ్ పెరిగి ఛాతీలో మంట, కడుపు నొప్పి వస్తాయి. అలాగే తలనొప్పి, వికారం, కడుపు ఉబ్బరం సమస్యలకు దారి తీస్తుంది. స్పైసీ ఫుడ్ వల్ల వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేసవిలో స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్.
Similar News
News January 16, 2026
రికార్డింగ్ డాన్సులను బ్యాన్ చేయండి: సునీతా కృష్ణన్

AP: సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న రికార్డింగ్ డాన్సులపై సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతులతో అసభ్యకరంగా టాప్లెస్ డాన్స్లు చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాగరిక పద్ధతిని సమాజం సాధారణ విషయంగా చూడటం అత్యంత ప్రమాదకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా సీఎం చంద్రబాబును కోరారు.
News January 16, 2026
భారీ జీతంతో SBIలో ఉద్యోగాలు

<
News January 16, 2026
ఠాక్రేలకు BJP టక్కర్.. పవార్లకు దక్కని పవర్

ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన BMCపై 40 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల గుత్తాధిపత్యానికి BJP-షిండే కూటమి గండి కొట్టింది. విభేదాలు పక్కన పెట్టి ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఏకమైనా ముంబై ఓటర్లు మాత్రం మహాయుతివైపు మొగ్గు చూపారు. ఇక పవార్లకు పెట్టని కోటలైన పుణే, పింప్రి-చించ్వాడ్లోనూ ఊహించని ఫలితాలు వచ్చాయి. బాబాయ్ శరద్ పవార్, అబ్బాయ్ అజిత్ పవార్ మనస్పర్ధలు వీడి బరిలోకి దిగినా ప్యూహాలు పటాపంచలయ్యాయి.


