News August 30, 2025
VZM: జిల్లాలో జేజేఎం అమలు భేష్

ఇంటింటికి త్రాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ అమలు తీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని కేంద్ర బృందం అభినందించింది. బృందం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను శనివారం కలిసి, పథకం అమలుపై చర్చించారు. ప్రతీ ఇంటికి సురక్షిత త్రాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, పథకాన్ని సంపూర్ణంగా, మరింత పటిష్ఠంగా అమలు చెయ్యాలని కోరారు.
Similar News
News September 1, 2025
ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్: VZM SP

ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఐదు బృందాలుగా 30 మంది నిత్యం పహారా కాస్తున్నారని పేర్కొన్నారు.
News August 31, 2025
VZM: గౌరవ వందనం స్వీకరించిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.
News August 31, 2025
VZM: నేడు జిల్లాకి రానున్న గోవా గవర్నర్

గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.