News August 30, 2025

చిత్తూరు: లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు

image

జిల్లా కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీఆర్ఓ మోహన్ కుమార్, DC విజయ శేఖర్ బాబు ఆధ్వర్యంలో శనివారం లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. 11 బార్లు, గీత కార్మికులను ఒక బారుకు గాను 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిని చిత్తూరు నగరపాలక పరిధిలో 3, పుంగనూరు మున్సిపాలిటీలో 1, కుప్పం మున్సిపాలిటీలో 1 ఎంపికైన వారికి కేటాయించినట్లు తెలిపారు.

Similar News

News September 3, 2025

చిత్తూరు: మహిళ మృతిలో ట్విస్ట్

image

SRపురం(M) పాతపాళ్యానికి చెందిన పూజ మృతి హత్య అని తేలింది. SI సుమన్ వివరాల మేరకు.. యాదమరి(M) వరదరాజులపల్లెకు చెందిన వ్యక్తితో పూజకు వివాహం జరగ్గా మూడేళ్ల కిందట అతను చనిపోయాడు. ఆ తర్వాత భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతనెల 17న పూజను అతను కొట్టి చంపేసి ఉరేసుకున్నట్లు నమ్మించాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి ఆమెది హత్య అని నిర్ధారించారు. నిన్న రీపోస్ట్‌మార్టం చేశారు.

News September 2, 2025

చిత్తూరు: దోమల నియంత్రణకు చర్యలు ఏవీ..!

image

వాతావరణ మార్పుతో పాటు దోమలు ఎక్కువైపోయాయి. అటు పంచాయతీలు..ఇటు పట్టణాలు రెండు వైపులా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్లు కూడా రోగులతో నిండిపోయాయి. ఆరోగ్య శాఖ ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 2, 2025

తిరుపతి ఎస్వీయూకి 71 ఏళ్లు

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించి నేటితో 71 వసంతాలు పూర్తయింది. 1954 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చేతులమీదుగా వర్సిటీని ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. కాగా ఇవాళ సాయంత్రం యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో వర్సిటీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.