News August 31, 2025
GDK: ‘ర్యాగింగ్ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలి’

ర్యాగింగ్ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాస రావు అన్నారు. శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే జైలు శిక్ష, విద్యా సంస్థ నుంచి సస్పెండ్ చేయడం తప్పదన్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు.
Similar News
News September 2, 2025
మీకు కన్నడ వచ్చా: రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం

కర్ణాటక పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘మీకు కన్నడ వచ్చా?’ అని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య అడిగారు. ‘కన్నడ నా మాతృ భాష కాకపోయినా అన్ని భాషలను గౌరవిస్తాను. ప్రతిఒక్కరు తమ భాషను కాపాడుకోవాలి. కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. కాగా కర్ణాటకలో ఉండేవారు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని ఇటీవల సిద్దరామయ్య చెప్పడం వివాదాస్పదమైంది.
News September 2, 2025
తొర్రూర్: వైజాగ్ టూర్కు స్పెషల్ బస్సు

తొర్రూరు పరిసర ప్రాంత ప్రజలు వైజాగ్ యాత్ర స్పెషల్ సర్వీసును వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పద్మావతి కోరారు. ఈ బస్సు ఈనెల 12న ఉ.5 గం.కు తొర్రూరు నుంచి బయలుదేరి పరిటాల హనుమాన్ ఆలయం, విజయవాడ కనకదుర్గ గుడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్ సందర్శించి 14న ఉదయం తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300గా నిర్ణయించినట్లు తెలిపారు.
News September 2, 2025
సెప్టెంబర్ 2: చరిత్రలో ఈ రోజు

1956: నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ జననం
1965: భారత తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ జననం
1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం
1971: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జననం (ఫొటోలో)
2009: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం(ఫొటోలో)
2022: తెలంగాణ ఉద్యమ నేత మందాడి సత్యనారాయణరెడ్డి మరణం